Wednesday, May 22, 2024

AP | అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు : చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో (శనివారం) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తమ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో అన్ని రంగాలను జగన్ నాశనం చేశాడని ఆరోపించారు.

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. ఏపీ ప్రయోజనాల కోసమే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. పెదకూరపాడులో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement