Saturday, April 27, 2024

పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి   

ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని లక్ష్మీ నరసింహ స్వామి కొండపై పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. హనుమంతునిపాడులో మండలం వాలిచర్ల గ్రామానికి చెందిన వారు పొదిలి నుండి ఘాటు రోడ్డులో లక్ష్మీ నరసింహ స్వామి కొండకు ట్రాక్టర్లో పెళ్లి బృందం బయలుదేరింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్క సారిగా బోల్తా పడటంతో దేవమ్మ (45), కమలమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నరసింహా స్వామి సన్నిధిలో వివాహ కార్యక్రమానికి ట్రాక్టర్ లో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement