Thursday, April 25, 2024

AP: బీజేపీ నాయకుడి దారుణ హత్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ నేత‌ మల్లారెడ్డిని దుండగులు దారుణంగా క‌త్తుల‌తో నరికి హత్య చేశారు. పార్టీ కార్యక్రమాల కోసం బైక్‌పై వెళ్తుండగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిట్యాల వద్ద ముందుగా కారుతో ఢీకొట్టి అతన్ని చంపాలని దుండగులు ప్రయత్నించారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్న మల్లారెడ్డిని వెంటాడి కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement