Monday, May 6, 2024

ఏపీలో కొత్త‌గా 1166 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1166 కొత్త కేసులు నమోదవ‌డంతో పాటు కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,11,133 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు న‌మోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 256 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనాతో 14,688 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,64,032 గా ఉంది. 32,413 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్ప‌టి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,27,84,934 నమూనాలను పరీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement