Saturday, May 18, 2024

విద్యుత్ షాక్ తో సబ్ స్టేషను అపరేటర్ మృతి

పినపాక,ఆగష్టు 27,(ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషను లో విద్యుత్ శాఖతో ఆపరేటర్ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల‌ మండలానికి చెందిన,కోత్తపల్లి రమేష్ ఏడూళ్ళ బయ్యారం, విద్యుత్ సబ్ స్టేషను లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సబ్ స్టేషను లోని యార్డ్ లో, ఫీడర్ అన్ చేస్తుండగా,ఒక్క సారిగా విద్యుత్ ప్రసరించడంతో,షాక్ గురయ్యాడు..

వెంటనే గమనించిన విద్యుత్ సిబ్బంది పినపాక ప్రభుత్వ అసుపత్రికి వైద్యం కోసం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా అసుపత్రికి తీసుకువెళ్ళామని తెలిపారు.వెంటనే ప్రైవేటు వాహనంలో తీసుకు వెళ్ళారు.వైద్య పరీక్షలు నిర్వహించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement