Tuesday, May 14, 2024

నాదర్ గుల్ గ్రీన్ హోమ్స్ కాలనీలో బిజెపి ఆత్మీయ సమావేశం

మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఈరోజు ఉదయం బడంగ్పేట్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో గ్రీన్ హోమ్స్ కాలనీ వాసులతో కార్పొరేటర్ నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.గ్రీన్ హోమ్స్ కాలనీకి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాకాలంలో ముంపునకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరాములు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పట్టం కట్టేలా గ్రామం +కాలనీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు బీజేపీ నాయకులు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాలనీ సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్, కాలనీ వాసులు సహా పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement