Tuesday, May 14, 2024

జ‌య‌మ్మ పంచాయితీపై -ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు స్పంద‌న‌

ఉత్త‌రాంధ్ర యాస‌లో తెర‌కెక్కుతోంది జ‌య‌మ్మ పంచాయితీ చిత్రం. ఈ చిత్రంలో స్టార్ యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది.
ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ ద్వారా వెల్లడైంది. దీనిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. శ్రీకాకుళం యాసలో సినిమాలు తీస్తుండడం చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుందని కితాబిచ్చారు. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మన భాష, సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలు ఉండాలని సూచించారు. జయమ్మ పంచాయితీ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement