Sunday, May 19, 2024

ఆలయ అభివృద్ధికి పాటు పడాలి : సునీతామహేందర్ రెడ్డి

యాదాద్రి : ఆలయ ఆభివృద్దికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, జడ్పి చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని బొమ్మలరామారం మండల మరియాల గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపిపి చిమ్ముల సుధీర్ రెడ్డి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు పునగాని వెంకటేష్ గౌడ్, బొమ్మలరామారం మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement