Saturday, May 18, 2024

Kadapa : కడపలో వ్యక్తి దారుణ హత్య

కడప,ప్రభ న్యూస్: డబ్బులు బాకీ విషయంలో తలెత్తిన వివాదంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కడప పట్టణం చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన కిరణ్ దగ్గర సాయిపేట కు చెందున మహేష్ 50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆదివారం రాత్రి రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయమై గొడవ జరిగింది.

దీంతో మహేష్..కత్తి తో కిరణ్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే దాడి చేసిన మహేష్ చిన్నచౌక్ స్టేషన్ లో లొంగిపోయాడు. రిమ్స్ ఆస్పత్రికి కిరణ్ మృతదేహం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement