Saturday, May 4, 2024

WGL: ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి…

వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రైల్వే ట్రాక్ పై ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయి. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. రెండు మృతదేహాల్లో ఓ మృతదేహం నెక్కొండ మండలంలోని గొల్లపల్లి గ్రామ శివారు గేటుపల్లి తండాకు చెందిన బానోత్ కిర్ సింగ్(45) అనే వ్యక్తిగా గుర్తించారు.

కీర్ సింగ్ నెక్కొండ మండల కేంద్రంలో పలు హోటళ్లలో పనిచేస్తూ జీవించేవాడని, మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మరో వ్యక్తి మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు, వివరాలు లభించకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడి మరణించారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement