Saturday, May 4, 2024

HYD | ప్రగతినగర్​లో కొండచిలువ కలకలం.. అపార్ట్‌మెంట్ల‌లోకి వ‌స్తున్న పాములు!

కుత్బుల్లాపూర్ (ప్ర‌భ న్యూస్‌) : హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో కొండ‌చిలువ హ‌ల్ చ‌ల్ చేసింది. ఇవ్వాల (గురువారం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రెండో డివిజ‌న్‌లో అతిపెద్ద కొండ‌చిలువ క‌నిపించింది. సాయి ఎలైట్ అపార్ట్‌మెంట్‌, ఎన్నారై కాలనీలో ఈ కొండచిలువ చొర‌బ‌డ‌డంతో స్థానికులు ఆందోళ‌న చెందారు.

ఇది దాదాపు పది అడుగుల మేర ఉంటుంది. గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనకు గురి కాగా.. సేవ్ స్నేక్ బృందానికి స‌మాచారం అందించారు. వెంటనే సేవ్ స్నేక్ బృందం సాయి లైట్ అపార్ట్మెంట్ కి చేరుకొని అక్క‌డ ఉన్న కొండచిలువను పట్టుకున్నారు. భారీ వర్షాలు పడడంతో సమీప ప్రాంతం నుండి పెద్ద సంఖ్య‌లో పాములు, కొండ‌చిలువ‌లు ఇలా అపార్ట్‌మెంట్ల‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement