Saturday, April 27, 2024

నిజాంపేట్ మేయ‌ర్ కోల‌న్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రపతి చేత‌ అవార్డు అందుకున్న‌ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఈసంద‌ర్భంగా సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ సర్పంచ్ నగేష్ చారి, NMC ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేంద్ర రెడ్డి, బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ దశరథ్, తలారి సాయి ముదిరాజ్, SC సెల్ ప్రధాన కార్యదర్శి నీరుడు యాదగిరి, 10వ డివిజన్ ప్రెసిడెంట్ నగేష్, మాజీ వార్డ్ మెంబర్ మల్లేష్, కిరణ్ కుమార్, NMC కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement