Monday, April 29, 2024

ఏపీ సీఎం జగన్ ను కలిసిన సమంత బెస్ట్ ఫ్రెండ్‌.. కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పా రెడ్డి కలిశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన శిల్పా రెడ్డి.. సీఎం జగన్ ను విజయవాడలో కలిశారు. ఆమె జగన్ దంపతులతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

“ఇంత ఆతిథ్యం, ​​ప్రేమ, ఆప్యాయతతో నన్ను మీ ఇంటికి స్వాగతించినందుకు ధన్యవాదాలు భారతి, జగన్ గారూ… ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది” అంటూ పోస్ట్ చేశారు. అయితే, శిల్పారెడ్డి సీఎంను ఎందుకు కలిసింది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, సీఎం జగన్ దంపతులతో దిగిన శిల్పారెడ్డి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement