Monday, May 6, 2024

RR : దీపావళి సందర్భంగా టపాకాయలను రైలులో తీసుకెళ్లొద్దు… సిఐ రాజేంద్రప్రసాద్

వికారాబాద్, నవంబర్ 9 ( ప్రభ న్యూస్): వికారాబాద్ రైల్వే జంక్షన్ లో రైల్వే సీఐ రాజేంద్రప్రసాద్ నేతృతంలో రైల్వే సిబ్బంది గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించి రైళ్లలో దీపాలు సంబంధించిన టపాకాయలు గాని ఇతర మందు పేలుడు సామాగ్రి గాని తీసుకు వేళ్ళ వద్దని సూచించారు.

తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే దీపావళి సందర్భంగా సామాన్య ప్రజలు రైలలో ఎటువంటి పేలుడు సమగ్ని తీసుకువెళ్లదని తీసుకెళ్లడం ద్వారా ప్రజలకు ఇబ్బంది అందరూ ఇబ్బంది పడతారని అన్నారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలంటే రైళ్ల‌లో ఎటువంటి పేలు పదార్థాలు తీసుకు వెళ్ళవద్దని అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement