Saturday, May 18, 2024

RR : వీరంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి కుమార్తె అనన్య చేతన్

వికారాబాద్, నవంబర్ 9 ( ప్రభ న్యూస్): నిరంతరం ప్రజల కోసం పనిచేసే తమ నాన్నను గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య చేతన్ కోరారు. గురువారం వికారాబాద్ మండలం పీరం పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది గురువారెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తీసు సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ నాన్న తమను పట్టించుకున్నప్పటికీ నిరంతరం వికారాబాద్ ప్రజల కోసం ఎత్తించారని చిన్నపిల్లల సైతం పట్టించుకోకుండా వికారం భావించి పది సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారని ఆమె తెలిపారు. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో హస్తము గుర్తుకు ఓటు వేసి ప్రసాద్ కుమార్ ను గెలిపించాలని ఆమె కోరారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు న్యాయవాది గురువారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ప్రసాద్ కుమార్ ను గెలిపించాలని ఆయన కోరారు. ప్రతి మనిషిని మంచిగా పలకరించే ప్రసాద్ కుమార్ గెలవడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement