Monday, May 6, 2024

MDK: కాళ్లకల్ వ‌ద్ద‌ రోడ్డు ప్రమాదం.. తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం

మనోహరాబాద్, ప్రభ న్యూస్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కాళ్లకల్ 44వ జాతీయ రహదారి పై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుండి తుప్రాన్ వైపు స్కూటీపై ఓ తల్లి, కూతురు, కుమారుడు వెళ్తుండగా జాతీయ రహదారి కాళ్లకల్ గ్రామంలోని గోశాల వద్ద గుర్తు తెలియని వాహనం వెనక నుండి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో తల్లి, కూతురు, కుమారుడు ముగ్గురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో తుప్రాన్ సిఐ శ్రీధర్, మనోహరబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని ఢీకొట్టిన వాహనం సమాచారం కోసం పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement