Sharmila: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం ఆగర్ మియాగూడ నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల 7వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఆగర్మీయాగూడ నుంచి మొదలైన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సొంత ఊరు తిమ్మాపూర్ మీదుగా కొనసాగింది.
తిమ్మాపూర్లో నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు షర్మిల. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని మద్దతు తెలిపారు. దారి పొడవునా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు షర్మిల.