Wednesday, May 8, 2024

చీప్ లిక్కర్ తో బీజేపీ… ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్: షర్మిల

బీజేపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం క్వార్టర్ రూ.50కే అందిస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం సోముపై సెటైర్లు వేశారు. తాజాగా సోము వీర్రాజు,  కేటీఆర్ ను ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“చీప్ లిక్కర్ తో బీజేపీ… ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్. మద్యం ద్వారా నేతలు ప్రజల రక్తం పీల్చుతున్నారు. ఎక్కడ చూసినా మద్యం, ఏ సమయంలోనైనా మద్యం. లిక్కర్ పేరుతో దోచుకుంటున్నారు. మద్యానికి ప్రజలను, యువతను బానిసలను చేస్తున్నారు. మహిళల భద్రతను గాలికొదిలేస్తూ, జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, స్కూళ్ల పక్కన కూడా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు” అని షర్మిల మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement