Sunday, May 5, 2024

రైలు ఢీకొని యువకుడు మృతి

వెల్దుర్తి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది బంధువులు రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మాసాయిపేట గ్రామానికి చెందిన పోతనపల్లి బాబు 26 మాసాయిపేట రైల్వే బ్రిడ్జి వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తల మండెం వేరువేరుగా పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు

ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు రైల్వే పట్టాలకు అనుకొని మద్యం దుకాణం ఉండడంతో నిత్యం ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మద్యం దుకాణాన్ని ఇక్కడి నుండి తీసివేసి వేరొక చోటికి మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

V

Advertisement

తాజా వార్తలు

Advertisement