Thursday, May 2, 2024

Khammam: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో ఖమ్మం రూరల్ మండలం అరెంపుల వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్ రావు వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న రాజేష్ ద్విచక్ర వాహనంపై ఖమ్మం వస్తుండగా అతివేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలై మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ మృతి చెందిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement