Sunday, May 5, 2024

Yashodaలో కెసిఆర్‌కు చంద్రబాబు పరామర్శ…

హైదరాబాద్‌: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తుంటి ఆప‌రేష‌న్ విజ‌య వంత‌మైంద‌ని, వేగవంతంగా కెసిఆర్ కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపారు.. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో డిశ్చార్జి చేస్తామ‌ని చెప్పారు. అనంత‌రం కెసిఆర్ తో ఆయ‌న కొంత‌సేపు మాట్లాడారు… అలాగే అక్క‌డే ఉన్న కుమారుడు కెటిఆర్, కుమార్తె క‌విత‌ల‌కు ధైర్యం చెప్పారు..సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్ర‌జా క్షేత్రంలోకి కెసిఆర్ వ‌స్తార‌ని వారితో అన్నారు.. అలాగే ప్ర‌మాదం జ‌రిగిన తీరును వారిని అడిగి చంద్ర‌బాబు తెలుసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement