Sunday, April 28, 2024

Victory Venkatesh – సరికొత్త కథనంతో సైంధవ అంద‌ర్ని మెప్పిస్తుంది….

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) – సరికొత్త కథ కథనంతో సైంధవ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రముఖ సినీ హీరో విక్టరీ వెంకటేష్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన 75వ చిత్రం సైంధవ మూవీ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ఒక ప్రముఖ హోటల్లో చిత్ర బృందం సోమవారం సందడి చేసింది.
సైంధవ మూవీ ప్రమోషన్స్ లో హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్, దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాత వెంకట్ బోయినపల్లి, నూతన నటి బేబీ సారా లు పాల్గొన్నారు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సైంధవ చిత్రం విశేషాలను మీడియాతో పంచుకున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానున్న సైంధవ చిత్ర విశేషాలను హీరో విక్టరీ వెంకటేష్ వివరిస్తూ సైంధవ మూవీ కొత్త కథ, కథనం తో తెరకెక్కనుందన్నారు. ఈ చిత్రంలో యాక్షన్ ,ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు మేచ్చే విధంగా ఉండబోతుందన్నారు. దర్శకుడు శైలేష్ స్టోరీ చెప్పగానే చిత్రం ఒప్పుకున్నానన్నారు. హీరోయిన్ శ్రద్ధ ఈ చిత్రంలో చాలా బాగా నటించిందన్నారు. ప్రేక్షకులు మెచ్చితే సైంధవ 2 కూడా తీస్తామన్నారు. జనవరి 13 సంక్రాంతిన ఈ చిత్రం విడుదల కానుందనీ, ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్నారు. మరిన్ని మల్టీస్టార్ చిత్రాల్లో నటించే అవకాశం ఉందన్నారు.

చిత్ర దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ హిట్, హిట్టు టు ఘనవిజయాల తర్వాత ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాన్నారు. యాక్షన్ సెంటిమెంటుతో ఈ చిత్రం తెరకెక్కనుందన్నారు. హీరో విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం తాను తీయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరో చూడని కొత్త విక్టరీ వెంకటేష్ ని మీరు ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారనీ చెప్పారు. ఈ చిత్రంలో సంగీతం పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయన్నారు. ప్రేక్షకులందరూ జనవరి 13వ తేదీన,సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement