Sunday, April 28, 2024

హుస్సేన్ సాగ‌ర్ లోకి దూకిన మ‌హిళ‌-మృత‌దేహాన్ని వెలికి తీసిన పోలీసులు

ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్యకి పాల్ప‌డింది. హైద‌రాబాద్ లోని హుస్సేన్ సాగ‌ర్ లోకి దూకింది ఆ మ‌హిళ‌. దాంతో ఆమె చ‌నిపోయింది. మృత‌దేహాన్ని బ‌య‌టికి తీశారు పోలీసులు. శైల‌జ అనే మ‌హిళ గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.ఈమె వ‌య‌సు 38సంవ‌త్స‌రాలు. అందుకే ఆమె ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement