Saturday, May 11, 2024

సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు – ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ పై పోలీస్ కేసు

సీఎం కేసీఆర్ ని ప‌రుష ప‌ద‌జాలంతో దూషించ‌డ‌మే కాదు..తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగా ఎంపీ అర‌వింద్ వ్యాఖ్య‌లు చేశార‌ని పోలీసు కేసు న‌మోదు చేశారు.ఈ విష‌య‌మై అడ్వ‌కేట్ ర‌వి కుమార్.. స‌రూర్‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాంప‌ల్లిలోని బీజేపీ ఆఫీసులో జులై 13న ఎంపీ అర‌వింద్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను దూషించిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ దూషించిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియో క్లిప్‌ను కూడా పోలీసుల‌కు అందించారు. ఈ మేర‌కు పోలీసులు ఎంపీ అర‌వింద్‌పై ఐపీసీ సెక్ష‌న్ 504, 505(1) సీ కింద కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement