Tuesday, May 14, 2024

Wishes – ఆర్ధిక సంస్క‌ర‌ణ‌ల క‌ర్త పివికి అత్యున్న‌త గౌర‌వం – రేవంత్ రెడ్డి …

హైద‌రాబాద్ – తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ ప్రధానిగా సేవలందించిన పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో కొత్త ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఇతర దేశాలతో పోటీ పడేలా చేసిన గొప్ప వ్యక్తి పీవీ అని అన్నారు. ‘భారతరత్న’ పురస్కారం ఆలస్యమైనా ఆయనకు ఆ గౌరవం దక్కడం దేశ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తరపున, రాష్ట్ర ప్రజల తరపున, సభ తరపున పీవీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆయన ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా రాజాకార్ల దాష్టీకంపై ఎనలేని పోరాటాలు చేసి హైదారాబాద్ సంస్థాన విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని రేవంత్ కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement