Saturday, April 27, 2024

TS: ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం… ప్రాజెక్టుల లోపాల‌పై మంత్రి ప్ర‌జెంటేష‌న్…

నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయ‌నున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ వెలుగు చూసేలా శ్వేతపత్రం ఉండాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు.అయితే, వాస్తవానికి శుక్రవారం నాడు సాయంత్రమే అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 5:51 నిమిషాలకు సభ ప్రారంభమైంది.. ఆ వెంటనే ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య లేచి మాట్లాడుతూ.. సభలో సాగునీటిరంగంపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అసవరం ఉంది ఈ నేపథ్యంలో సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు తప్పుబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement