Thursday, May 2, 2024

IND vs END: టీమ్ ఇండియాకు గట్టి షాక్…. మూడో టెస్టు నుంచి అశ్వీన్ ఔట్‌..

మూడో టెస్టులో టీంఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. కీలక బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

- Advertisement -

కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టెస్టు జట్టు నుంచి అశ్విన్ వైదొలిగాడు. ఇలాంటి సమయంలో బీసీసీఐతోపాటు టీమ్ ఇండియా అశ్విన్‌కు, అతని కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తుంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికే బీసీసీఐ తొలి ప్రాధాన్యతనిస్తుంది. ప్రస్తుత సమయంలో అశ్విన్, అతని కుటుంబం గోప్యతను గౌరవించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం అని బీసీసీఐ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement