Sunday, May 5, 2024

నేటి నుండి ఎండ‌లు పెరుగుతాయ్.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌

ఈ వేస‌విలో అకాల వ‌ర్షాల‌తో వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డింది. అయితే నేటి నుండి అస‌లు వేస‌వికాలం ప్రారంభంకానుంద‌ట‌. బుధవారం నుంచి హైద‌రాబాద్ లో పొడివాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్ల‌డించింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంగళవారం 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండ ఉంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరగనున్నాయి. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవంతో జనాలు ఉక్కిరిబిక్కిరికానున్నారు. అలాగే, ఈ రోజు నుంచి 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement