Wednesday, May 1, 2024

కాలే యాదన్నను చేవెళ్ల లో రెట్టింపు మెజారిటీతో గెలిపిస్తాం..!

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని మనీ గార్డెన్లో జరిగిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను భారీ మెజారిటీతో గెలిపించేందుకు అందరం కంకణ బద్ధులమై ఉన్నామని మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు ముక్తకంఠంతో నినదించారు.

మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ కార్యకర్తల క్షేమాన్ని కాంక్షిస్తూ గడప గడపకు శుభోదయం పేరిట చేరుకొని ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించిన గొప్ప నాయకుడు యాదయ్య అని వారు పేర్కొన్నారు. ఆపదలో ఉంటే పార్టీలకతీతంగా స్పందించే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకుడు కాలే యాదయ్య అని వారు పేర్కొన్నారు. గతంలో వచ్చిన మెజారిటీకి రెట్టింపు మెజారిటీతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గోవిందమ్మ, గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ అధ్యక్షుడు బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ వెంకటేశం, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు పొడవు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు రాజునాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement