Thursday, May 16, 2024

TS: 17స్థానాల్లోనూ విజ‌యం సాధించాల్సిందే – కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని.. ఈ అనుకూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవాలని కిషన్‌ రెడ్డి బీజేపీ నేతలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కోసం బీజేపీ వివిధ కమిటీలు వేసింది.. ఆ కమిటీలు చేసిన, చేయాల్సిన పనులపై కిషన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ప్రధాని మోదీ ఆదిలాబాద్, సంగారెడ్డి సభలను ప్రజలు విజయవంతం చేశారన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా విజయ సంకల్ప యాత్ర విజయవంతమైందన్నారు. పార్టీ జెండా మీదనే యాత్ర నిర్వహించామన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలన్నారు. బీజేపీని దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. 17కు 17స్థానాల్లో విజయం సాధించాలంటే ఎన్నికల నిర్వహణ స‌క్ర‌మంగా ఉండాలని కిషన్‌ రెడ్డి వివరించారు. ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను క‌లుపుకుని ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement