Sunday, May 19, 2024

బాజరెడ్డి గోవర్ధన్ కు జన నీరాజనం

నిజామాబాద్ రూరల్ఆగస్ట్ 23 ప్రభ న్యూస్రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న శాసన సభ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్దన్ మరోసారి ఎంపికై న నేపథ్యంలో బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చేరుకోగా భారీ వాహన ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు. ఇందల్వాయి మండలం చంద్రయన్ పల్లి వద్ద ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.

చంద్రాయన్ పల్లి వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి గన్నారం గ్రామం వద్ద తల్లి తెలంగాణ శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భారీ గజమాలతో ఎమ్మెల్యే ను సన్మానించారు.అనంతరంఇందల్వాయి సాయి బాబా దేవాలయం లో బాజిరెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.భారీ వాహన శ్రేణి తో నిజామాబాద్ జిల్లాకు బయలుదేరిన మార్గమధ్యంలో డిచ్ పల్లి మండలం కేంద్రంలో తెలంగాణ తల్లి , డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మాధవ నగర్ సాయిబాబా దేవాలయంలో కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు

.ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగ న్ జిల్లా ఒలంపిక్ అధ్యక్షులు నూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి , ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ తో పాటు అ న్ని మండలాలకు చెందిన స్థానిక ఎంపీపీలు, జడ్పిటిసిలు, వైస్ ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement