Thursday, May 2, 2024

తెలంగాణలో రామరాజ్యం సాధిస్తాం.. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్

పాలకుర్తి, (ప్రభ న్యూస్) : తెలంగాణలో రామరాజ్యం నిర్మించి తీరుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాలకుర్తి చౌరస్తాలో బహిరంగ సభలో మాట్లాడారు. 1400 మంది అమరవీరులు త్యాగాలు చేసి, సాయుధ రైతాంగ పోరాటం చేస్తే 17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించాలని అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవ‌డం లేద‌ని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలకుర్తి నియోజకవర్గం లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నిర్మించకపోవడం ఇక్కడి పాలకులకు సిగ్గుచేటు అన్నారు. సాగునీరు అందించేందుకు ఇక్కడ ఒక రిజర్వాయర్ కూడా నిర్మించకపోవడం ఈ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రి దయాకర్ రావు ప్రజల వ్యతిరేకంగా పాలన సాగుతుందన్నారు. ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప‌లువురు బీజేపీ లీడ‌ర్లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement