Wednesday, May 1, 2024

షాపు తాళం పగుల‌కొట్టి దొంగతనం.. సీసీ కెమెరాలో రికార్డ్

కిరాణా షాపులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాళం ప‌గుల‌గొట్టి 5వేల న‌గ‌దుని ఎత్తుకెళ్లాడు.ఈ ఘ‌ట‌న వరంగల్ జిల్లా చెన్నారావుపేట గ్రామ శివారులోని జాగృతి విద్యానికేతన్ పాఠశాల సమీపంలో ననుమాస వీరస్వామి కిరాణా షాపులో చోటు చేసుకుంది.బాధిత వ్యక్తి కథనం ప్రకారం షాప్ ను గురువారం రాత్రి మూసివేసి ఇంటికి వెళ్లానని తిరిగి శుక్రవారం ఉదయం షాప్ ఓపెన్ చేద్దామని వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం.. గల్లాపెట్టేలో ఉన్న డబ్బులు పోయినట్లు గుర్తించానని,అర్ధరాత్రి ఒంటి గంట సమయాన ఈ దొంగతనం జరిగిందని అన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి విచ్చేసి ఆధారాలు సేకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.కాగా దొంగతనం చేసిన వ్యక్తి ఫోటోలు ..వీడియోలు సిసి కెమెరాలో కనిపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement