Tuesday, May 21, 2024

యువతి ఆత్మహత్య

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేని ఓ యువతి ఆత్మహత్యకు పాల్ప‌డింది. మండలంలోని గట్లనర్సింగాపూర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితుడు జగదీశ్‌తో కలిసి ఆ యువతి ఇంటికి వచ్చిన వంశీ ఆమెతో గొడవపడ్డాడు. అదే సమయంలో ఆమె తండ్రి రావడంతో భయపడి పారిపోతూ.. తనను ప్రేమించకుంటే ఎప్పటికైనా చంపేస్తానని, పరువు తీస్తానని బెదిరించాడు. అవమానం భరించలేని ఆ యువతి నిన్న గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement