Thursday, May 2, 2024

కిసాన్, జవాన్ ల ప్రాణాలు తీస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

దేశానికి అన్నం పెట్టే రైతు,దేశానికి రక్షణనిచ్చే జవాన్ల ప్రాణాలను మోదీ ప్రభుత్వం తీస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. అగ్నిపథ్ ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ లో ఆర్మీ పరీక్షలు రాసిన నిరుద్యోగ యువత చేసిన ఆందోళనలో కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ మృతదేహం ఎంజీఎం మార్చురీకి చేరుకున్న సమాచారంతో రాత్రి మార్చురీకి వెల్లి రాకేష్ మృతదేహం వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. దేశంలో రైతులు, జవాన్ ల ప్రాణాలు బీజేపీ ప్రభుత్వం తీస్తుందన్నారు. అగ్నిపథ్ పేరుతో ఆర్మీలో నాలుగేళ్ళ రిక్రూట్ మెంట్ తీసుకువచ్చి సైనికుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. నిరసన తెలిపినందుకు పేద విద్యార్థిని కాల్చిచంపడం హేయమైన చర్య అన్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై అగ్గిరాజేసుకుందన్నారు ఈ అగ్గిలో కేంద్ర ప్రభుత్వం మాడి మశైపోతుందన్నారు. ఆదాని అంబానీలకు కొమ్ముకాస్తూ రైతులకు వ్యతిరేఖంగా నల్లచట్టాలు తీసుకొచ్చి ప్రశ్నిస్తే రైతులను కాల్చిచంపాలని, నేడు అగ్నిపథ్ ను ప్రశ్నిస్తే పరీక్షలు రాసి ఎంపికైన అభ్యర్థులను కాల్చి చంపుతున్నారన్నారు. ఓట్లు సీట్లే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని,ప్రజల అవసరాలు, ఆకాంక్షలు బీజేపీకి పట్టవన్నారు. మతం పేరుతో ప్రజల్లో విద్వేశాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీకి తెలిసిందేం లేదన్నారు. రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలిచారన్నారు. వారికి 25 లక్షల పరిహారం, రాకేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ణతలన్నారు. రాకేష్ కుటుంబానికి అండగా ఉంటామని, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిదులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, యువత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement