Thursday, May 16, 2024

పెరుగుతోన్న క‌రోనా-కొత్త‌గా 13వేల కేసులు

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కొత్త‌గా 13వేల కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 4,84,924 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… 13,216 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 8,148 మంది కరోనా నుంచి కోలుకోగా… 23 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 5,24,840 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.63 శాతంగా, క్రియాశీల రేటు 0.16 శాతంగా ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 14,99,824 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement