Friday, May 3, 2024

మురిసిన మువ్వన్నెల జెండా..

జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనురాగ్ శర్మ ఐపీఎస్ (రిటైర్డ్)
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి అనురాగ్ శర్మ ఐపీఎస్ (రిటైర్డ్) హాజరై జాతీయ పతాకాన్ని జెండాను ఎగరవేశారు. రాష్ట్ర అభివృద్ధి వివిధ శాఖల ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని సందేశం చదివి వినిపించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఫింఛన్లను కొత్త లబ్దిదారులకు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల శకటాలను పరిశీలించారు. ఈ వేడుకల్లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆడిషనల్ కలెక్టర్ దివాకర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement