Sunday, May 19, 2024

WGL: ఈదురు గాలుల భీభత్సం… చెట్టుపడి యువకుడు మృతి

వ‌ర్ధ‌న్న‌పేట‌, మే 8(ప్ర‌భ‌న్యూస్) వ‌రంగ‌ల్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్టుప‌డి యువ‌కుడు మృతి చెందాడు. ఈఘ‌ట‌న వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లంలోని క‌ట్ర్యాల గ్రామ శివారులో చోటుచేసుకుంది.

- Advertisement -

ఇల్లంద గ్రామానికి చెందిన స్నేహితులు ఆబర్ల దయాకర్, నవీన్ ఇల్లంద గ్రామం నుంచి సంగెం మండలానికి ట్రాక్టరులో గడ్డిలోడుతో వెళ్లారు. గడ్డిలోడు దిగుమతి చేసి సాయంత్రం ఇల్లంద గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కట్ర్యాల శివారు వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

ఈక్రమంలో ఒక్కసారిగా రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టు విరిగి ట్రాక్టరు ట్రాలీ ట్రైలర్ పై కుప్ప కూలింది. దీంతో ట్రైలర్ లో ఉన్న ఆబర్ల దయాకర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదంలో నవీన్ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రుడు దయాకర్ ని చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతుడు హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement