Monday, May 6, 2024

టాటా ఏస్, బైక్ ఢీ.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఖాదర్ పేట క్రాస్ రోడ్డు వద్ద టాటా ఏస్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందారు. మృతుడు గూడూరు మండలం నాగారం గ్రామానికి చెందిన పరికిరాల సంతోష్ గా గుర్తించారు. జల్లి గ్రామానికి చెందిన బంధువుల ఇంటివద్ద శుభకార్యానికి హాజరై నర్సంపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్సై తోట మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement