Friday, May 3, 2024

తగ్గిన నీట్‌ కటాఫ్‌ స్కోర్‌.. కాళోజీ హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: నీట్‌ ఎండీస్‌ కటాఫ్‌ స్కోర్‌ తగ్గిన నేపథ్యంలో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ యాజమాన్య కోటాలో దరఖాస్తులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్‌ ఎండీస్‌ కటాఫ్‌ స్కోర్‌ను తగ్గించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 24న ఉదయం 8 నుండి 27న సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులతోపాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్రోల్‌ చేయాలని సూచించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుదిమెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement