Sunday, May 5, 2024

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : ఎమ్మెల్యే అరూరి రమేష్

మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 33 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో మన బస్తి – మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా పైడిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలకు ఇప్పటికే 75లక్షలు, ప్రాథమిక పాఠశాలకు 35లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలోనే పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభమౌతాయని వెల్లడించారు. పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement