Saturday, April 27, 2024

ఎవ‌రొచ్చినా పార్టీ జెండా గ‌ద్దె నిర్మాణం ఆపేది లేదు : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

బహుజన సమాజ్ పార్టీ జెండా గద్దె నిర్మాణాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరుండి చేప‌ట్టారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి… మానకొండూరు మండల కేంద్రంలో చెరువు కట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం ప‌క్కన నిర్మాణం చేయించిన జెండా గద్దెను శుక్రవారం అర్ధరాత్రి కూల్చివేసిన విషయం విధితమే.. కాగా శనివారం మండలంలోని వివిధ గ్రామాలలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించిన అనంతరం సుమారు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూల్చివేసిన స్థలంలోనే జెండా గద్దెను నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపడుతున్న స్థలానికి పోలీసులు వచ్చి గద్దె నిర్మానానికి అనుమతులు లేవని నిర్మాణం ఆపాలన్నారు. ఇతర పార్టీల జండా గద్దెలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని వారికి అనుమతులు ఉన్నాయా అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పోలీసులను ప్రశ్నించారు. ఆ పార్టీల జెండా గద్దలకు పర్మిషన్లు ఉంటే తీసుకురమ్మని, అప్పుడు తను చేస్తున్న జండా గద్దె నిర్మాణం ఆపేస్తానని పోలీసులతో చెప్పారు. ఎమ్మెల్యే రసమయి వచ్చిన, సీఎం కేసీఆర్ వచ్చిన జండా గద్దె నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుండి వెళ్లేది లేదని ఆర్ఎస్ పి పోలీసులతో చెప్పడంతో వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement