Monday, April 29, 2024

గుంటూరు పల్లి ఉపసర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పాలేపు రాంబాబుపై గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఐదుగురు వార్డు సభ్యులు గురువారం భూపాలపల్లి ఆర్డిఓ శ్రీనివాస్ కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన పాత్రలను అందజేశారు. ఉపసర్పంచ్ రాంబాబు గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనుల్లో సహకరించడం లేదని సభ్యులు ఆరోపించారు. దీంతో ఆర్డిఓ త్వరలో అవిశ్వాస తీర్మానానికి ఒక తేదీ నిర్ణయించి తెలియజేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement