Thursday, May 16, 2024

Breaking : మేం క‌డుతున్న‌వి ఇళ్లు కాదు – ఊర్లు – సీఎం జ‌గ‌న్

పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌డం కోసం మ‌హాయ‌జ్ఞం చేశామ‌న్నారు సీఎం జ‌గ‌న్. పేద‌ల‌కు 25వేల కోట్ల విలువైన భూములు ఇచ్చామ‌న్నారు. 30ల‌క్ష‌ల,76వేల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇచ్చామ‌ని తెలిపారు. కుల మ‌తాల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు.. అమ‌లు చేశామ‌న్నారు. ఇళ్లు కాదు ఏకంగా ఊళ్ల‌నే నిర్మిస్తున్నామ‌ని తెలిపారు సీఎం. ఏకంగా 17వేల కాల‌నీలు నిర్మిస్తున్నామ‌న్నారు జ‌గ‌న్. ఈ కాల‌నీల్లో స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ఏకంగా రూ.32,909కోట్లు ఖ‌ర్చు చేస్తాం అన్నారు. పేద‌ల ఇళ్ల‌కు త‌క్కువ ధ‌ర‌కే సిమెంట్, స్టీల్, 20ట‌న్నుల ఇసుక‌ను ఉచితంగా ఇస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement