Monday, April 29, 2024

డీసీఎం వ్యాన్ ను ఢీకొన్న మోటార్ సైకిల్.. ఒక‌రు మృతి

నర్సింహులపేట, ఏప్రిల్ 22 (ప్రభ న్యూస్) : ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ ను మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని గోపా తండా వద్ద రాత్రి జరిగింది. శనివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అజ్మీరా గ్రామ పంచాయతీ పరిధిలోని వాంకుడోత్ తండాకు చెందిన వాంకుడోత్ లచ్చు (45) మరిపెడ వైపు నుంచి పెద్దనాగారం వస్తున్న క్రమంలో గోపాతండా సమీపంలో సాంకేతిక లోపంతో ఆగిఉన్న డీసీఎం వ్యాన్ ను మోటారు సైకిల్ తో బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా నిమిత్తం జిల్లా ఆసుపత్రికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement