Monday, April 29, 2024

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రంజాన్ శుభాకాంక్షలు

వరంగల్ జిల్లా మట్టేవాడలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, సహాయం, ధానగుణం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాలను ఈ పవిత్ర రంజాన్ మాసం నేర్పిందన్నారు. మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకని,రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారన్నారు.మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మత్తులకు నిధులిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

మైనారిటీల సంక్షేమానికి దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని, నియోజకవర్గంలో మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఒక సెక్యులర్ నియోజకవర్గమని, అందరూ కలిసి కట్టుగా జీవిస్తామన్నారు. ఇమామ్, మౌజంలకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముభారక్ ద్వారా రూ.1,00,116 లు ఉచితంగా అందజేస్తుందన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరూ తమ బంధు, మిత్రులతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement