Wednesday, May 15, 2024

ఈనెల 21న వంద పడకల ఆస్పత్రి ప్రారంభించ‌నున్న మంత్రి హరీష్ రావు

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భూపాలపల్లి పట్టణంలోని పేద ప్రజల సౌకర్యార్ధం నిర్మించిన 100 పడుకల ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వెంకటరాణి సిద్దు, టిఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్ విలేకరులతో మాట్లాడుతూ… భూపాలపల్లి నియోజకవర్గం, జయశంకర్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు ఈ ఆస్పత్రి వల్ల అందుతాయన్నారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాతోడ్, జయశంకర్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షురాలు, వరంగల్ జ‌డ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, భూపాలపల్లి జెడ్పి ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి హాజరు అవుతారన్నారు. ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రజలు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement