Friday, May 3, 2024

వైకుంఠ రథాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వ్యక్తుల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠధామాలను ఏర్పాటు చేశారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు పురపాలక సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం ఏర్పాటు అయింది. అన్ని రకాల సదుపాయాలతో వాటిని ఏర్పాటు చేశామన్నారు. నగరాలు, పట్టణాలలో కూడా మోడల్ వైకుంఠధామాలను నిర్మించాం. ఇప్పుడు తొర్రూరు పట్టణంలో పాలక వర్గం, అధికారులు కలిసి వైకుంఠ రథం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు వైకుంఠ రథాన్ని వినియోగించుకునే విధంగా అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement