Thursday, May 2, 2024

కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ : రాయపర్తి మండలం, కాట్రపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న కంఠమహేశ్వర స్వామి(కాటమయ్య) ఆలయ నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొలనుకొండ నారాయణ, గుండ్లపల్లి సోమయ్య తదితర స్థానికులు పాల్గొన్నారు. వరంగల్ నుంచి రేగుల గ్రామానికి వెళ్తున్న సందర్భంగా కాట్రపల్లి వద్ద స్థానికులు శంకుస్థాపన కోసం గుమికూడగా మంత్రిని పలకరించారు. కాటమయ్య గుడి కోసం శంకుస్థాపన చేసుకుంటామని చెప్పగా.. వెంటనే తన కాన్వాయ్ ఆపి, స్థానికుని బైక్ పై కూర్చొని, గుడి నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి కొబ్బరి కాయ కొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement