Friday, April 26, 2024

మావోయిస్ట్ మృత‌దేహం ల‌భ్యం

ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లాలోని ఓ గ్రామంలోని అడవిలో 8 లక్షల రివార్డుతో మావోయిస్ట్ మృతదేహం లభ్యమైంది. మరణించిన మావోయిస్ట్ కమాండర్ దేవా (అలియాస్ తిర్కి మద్కామి)గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై రూ.8 లక్షల రివార్డు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇత‌ను ద‌ర్భా డివిజన్‌లోని సీపీఐ మావోయిస్టు సంస్థకు చెందిన కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడుని, అనేక సంఘటనలో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు చంపి అడవిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం జిల్లాలోని కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం జియాకోడటాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం భూసారస్ లోయలో లభ్యమైనట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే జవాన్ల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహంతో పాటు ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహానికి సంబంధించిన పంచనామా, తదుపరి చర్యలు చేపట్టారు. నక్సల్ కమాండర్ దేవా అలియాస్ టిర్కీ మద్కామి మృతదేహంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement